ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట అమ్మితే రూ.34 లక్షలు ఆదాయం.. బైక్ ఆపి డబ్బులు లాక్కెళ్లిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 08:41 PM

ఓ రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. కష్టపడి పండించిన పంటను అమ్మితే డబ్బులు వచ్చాయి.. గేదెలు, ఇతర జీవాలను విక్రయించగా మరికొంత ఆదాయం వచ్చింది. అన్ని డబ్బులు ఓ సంచిలో పెట్టుకుని అత్తారింటికి బయల్దేరాడు. ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. జే పంగులూరు మండలం రాంకూరుకు చెందిన డి ధనచక్రవర్తి ఇటీవల ఎండుమిరప పంటను అమ్ముకోగా రూ.26లక్షల ఆదాయం వచ్చింది. తనకు ఉన్న గేదెలు, ఇతర జీవాలు విక్రయించగా మరో రూ.8లక్షలు వచ్చాయి.


చక్రవర్తి ఇంట్లో ఎవరూ లేని కారణంగా రూ.34 లక్షల డబ్బుల్ని తీసుకుని ద్రోణాదులలోని అత్తగారి ఇంటి దగ్గర దాచేందుకు బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో కోనంకి దాటిన తర్వాత సాగర్‌ కాల్వ దగ్గరకు రాగానే.. మరో బైక్‌పై మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ ముగ్గురు ఒక్కసారిగా వచ్చి చక్రవర్తి బైక్ తాళాన్ని తీసుకుని దూరంగా పడేశారు.. దానిని తీసుకువచ్చేలోపే బైక్‌లో ఉన్న డబ్బులు మొత్తాన్ని దోచుకుని పారిపోయారని బాధితుడు చెబుతున్నారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన పంటను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి అత్తారింట్లో దాచేందుకు వెళుతుంటే ఇలా జరిగిందని బాధితుడు చెబుతున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగిన దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే నాలుగు టీమ్‌లను రంగంలోకి దించి గాలింపు మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ వైద్యురాలి ఫొటోల మార్ఫింగ్ ఘటన కలకలంరేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలి ఫొటోలను కంభం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగారు. ఆ వైద్యురాలు తెనాలి పోలీస్‌స్టేషన్‌లో ఈ మధ్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఈ నెల 19న కంభం వచ్చిన తెనాలి పోలీసులు ఆ ఇద్దరు యువకుల్ని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. గతంలో బాధిత వైద్యురాలు ఈ ప్రాంతంలో పనిచేసినట్లు సమాచారం. అయితే నిందితుల్ని అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమేనని స్థానిక పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com