ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న బోడె ప్రసాద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:38 PM

తాడిగడప జాతీయ రహదారిపై వంతెనల వద్ద శనివారం పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఫుడ్‌కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంజీ రోడ్డు తరహాలోనే తాడిగడపలో సామాన్యునికి కూడా అందుబాటులో వివిధ రకాల ఆహారపదార్థాలు లభ్యమయ్యే ఏర్పాటు చేసిన మామిళ్లపల్లి పవన్‌ తదితరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి హేమచౌదరి, యువనాయకులు బోడె వెంకట్రామ్‌, అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్‌, తోటకూర ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ఫపోరంకిలోని వెంకటాపురం కాలనీలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమిషనర్‌ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వడ్లమూడి శుభశేఖర్‌, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ రమణారావు, క్రెడాయ్‌ విజయవాడ ప్రెసిడెంట్‌ దాసరి రాంబాబు, కార్యదర్శి శ్రీధర్‌, ట్రెజరర్‌ తుమ్మల వంశీ, సీహెచ్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com