ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని నిర్మాణానికి రూ.60 వేల కోట్లు ఖర్చు కావచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:19 PM

రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబరు 1న ప్రారంభమయ్యే అవకాశం ఉందని పురపాలక-పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి రూ.60 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని.. ప్రపంచ స్థాయిలో నంబర్‌ వన్‌ సిటీగా తీర్చిదిద్దుతామని.. నాలుగేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్‌ సౌత్‌కాన్‌-2024 సమావేశంలో ఆయన, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడారు. అమరావతితోపాటు సమాంతరంగా 26 జిల్లాలనూ అభివృద్ధి చేయాల ని సీఎం చంద్రబాబు ఆదేశించారని నారాయణ తెలిపారు. అమరావతి అభివృద్ధికి క్రెడాయ్‌ సహకరించాలని కోరారు. బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరగకుండా లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని, సింగిల్‌ విండోలో ఇవ్వడానికి కృషిచేస్తామని, ఆన్‌లైన్‌ వ్యవస్థను సరళీకరిస్తామని చెప్పారు. విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావ డం అదృష్టమని శ్రీనివాస వర్మ అన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ రెండు నెలల్లో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు 13 మంది కేంద్ర మంత్రులను అనేక సార్లు కలిశారని తెలిపారు. రాజధాని అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరిన వెంటనే కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన నిర్మాణ రంగ సంస్థలు రాష్ట్రానికి తిరిగి రావాలని పిలుపిచ్చారు. తమ సమస్యలపై క్రెడాయ్‌ ప్రతినిధులు నిర్మలాసీతారామన్‌తో పాటు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. బిల్డర్ల సమస్యల ను క్రెడాయ్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల శివారెడ్డి మంత్రుల దృష్టికి తీసుకెళ్లా రు. కార్యక్రమంలో పెనమలూరు, విజయవాడ తూర్పు, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, గద్దె రామ్మోహన్‌, బొండా ఉమ, క్రెడాయ్‌ అఖిల భారత అధ్యక్షుడు బొమన్‌ ఇరానీ, మాజీ అధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి, సంస్థ ప్రతినిధులు శ్రీధర న్‌ స్వామినాథన్‌, జి.రామిరెడ్డి, రాజు శ్రీనివాసు, ప్రవీన్‌, ప్రదీప్‌, ఆళ్ల శివారెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ ప్రాంతీయ హెడ్‌ ఎన్‌.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com