ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 03:35 PM

వారాంతపు సెలవు దినాల కారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లు నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 79,521 మంది భక్తులు దర్శించుకోగా 40,152 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.87 ఆదాయం వచ్చిందని వెల్లడించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com