శ్రీకాకుళం జిల్లా, సోంపేట, గొల్లగండి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డి జయరాం(34) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొ త్రఖండ గ్రామానికి చెందిన జయరాం కొర్లాం గ్రామంలో నివాసం ఉంటూ గొల్లగండిలో విధులు నిర్వహిస్తున్నాడు. పొత్రఖండ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా సంధికొత్తూరు వద్ద స్పీడ్బ్రేకర్ వద్ద అదుపు తప్పి కిందపడి మృతిచెందాడు. బారువ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తు న్నారు. జయరామ్కి తండ్రి రెడ్డి అప్పారావు ఉపాధ్యాయుడు కాగా తల్లి తులసమ్మ, ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. జయరామ్కి ఏడాది కిందటే వివాహం కాగా భార్య గర్భవతి. అందిరితో కలివిడిగా ఉండే జయరాం అకాల మృతిపై స్నేహితులు, గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.