అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు. గతంలో సేఫ్టీ ఆడిట్ జరగలేదని అందుకే ప్రమాదానికి కారణమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. శవ రాజకీయాల మీద పుట్టి... హత్య రాజకీయాల మీద పెరిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి హావబావాలు చూస్తే, ఎలా ఉన్నాయో ప్రజలందరూ చూశారన్నారు. బాధితులతో నవ్వుతూ మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. జగన్ ఇప్పటికైనా బాధిత కుటుంబాల పట్ల వారికి రక్షణగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ను కూడా డైవర్ట్ చేశారన్నారు. టీడీపీ ఎప్పుడు బాధితుల పక్షాన అండగా ఉంటుందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.