ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకు రైతులని ఆదుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:31 PM

పొగాకు రైతులకు అండగా ఉంటామని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ అన్నారు. కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సెస్‌ లేకుండా పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని, పామాయిల్‌ రైతులను కూడా అన్ని విధాల ఆదుకుంటా మన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, కరాటం సాయిబాబు, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు నంది, తదితర రైతులు, టీడీపీ, బీజేపీ నాయకులు ఉన్నారు. కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీ పుట్టా మహేశ్‌కు కాంట్రాక్టు నర్సుల నాయకులు వినతిపత్రం ఇచ్చారు. తామంతా ఏళ్ల తరబడి చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com