ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:42 PM

రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలను దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వెంకయ్య స్వామి ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగి ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com