ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల ప్రమాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 06:08 PM

బాపట్లలోని కేంద్రీయ విద్యాలయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదల కాగా, ఈ వాయువులు పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థులను కేంద్రీయ విద్యాలయ సిబ్బంది హుటాహుటీన బాపట్ల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ముప్పు లేదని వైద్యులు చంద్రబాబుకు తెలిపారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు నిర్దేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com