ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్ కత్తా డాక్టర్ పై అత్యాచారం నిందితులను కఠినంగా శిక్షించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 08:48 PM

కోల్ కత్తా లోని డాక్టర్ పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబానికి మద్దతుగా బుధవారం తిరుపతి లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కిరణ్ రాయల్, ఆకెపాటీ సుభాషిణి, హరి, సుమన్ బాబు,ఆది, సుమంత్, కిషోర్ సాయి దేవ్ ,మనోజ్,సుజిత్ మరియు ముఖ్య నేతలు వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని బాధితురాలికి వారి కుటుంబానికి మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే నిందితులకు శిక్ష పడేలా చట్టాలలో మార్పులు రావాలన్నారు. ఆడబిడ్డ కి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com