ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 మంది కాలేజీ యువతులపై సామూహిక అత్యాచారం.. 32 ఏళ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 10:54 PM

 దేశంలోనే సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసులో 32 ఏళ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు పడింది. మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. అందులో 9 మందికి ఇప్పటికే శిక్షలు ఖరారు కాగా.. ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి పరారీలో ఉండగా.. ఇంకొక వ్యక్తిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఇక మిగిలిన ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 100 మంది కాలేజీ యువతులపై సామూహిక అత్యాచారం చేసి.. వారిని బ్లాక్ మెయిల్‌ చేసిన.. అజ్మీర్ సెక్స్ స్కాండల్ బ్లాక్ మెయిల్ కేసులో రాజస్థాన్ అజ్మీర్‌లోని ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. మరోవైపు.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల జరిమానా విధించింది.


1992 లో రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ సెక్స్ స్కాండల్‌ కేసు అప్పట్లో దేశం మొత్తాన్ని కుదిపేసింది. అజ్మీర్‌లోని కాలేజీ యువతులే లక్ష్యంగా కొందరు వ్యక్తులు చేసిన అకృత్యాలు బయటికి రావడంతో ఈ సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 100 మందికిపైగా కాలేజీ అమ్మాయిలను సామూహిక అత్యాచారం చేసి.. వారి నగ్న ఫోటోలను వైరల్ చేశారు. ఈ క్రమంలోనే వారిని బెదిరించి.. మరికొంత మంది అమ్మాయిలను తీసుకువచ్చేలా నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నఫీస్ చిస్తీ ప్రధాన నిందితుడు అని తేల్చారు.


ఈ నేపథ్యంలోనే ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్‌ కేసులో అజ్మీర్ స్పెషల్ కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు వేసింది. నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను తాజాగా స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉన్నట్లు తేలింది. వారిలో 9 మందికి ఇప్పటికే శిక్షలు పడగా.. మిగిలిన 9 మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి పరారీలో ఉండగా.. ఇంకో వ్యక్తిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. తాజాగా మిగిలిన ఆరుగురు వ్యక్తులకు కోర్టు శిక్ష విధించింది.


ఇక గతంలోనే 9 మంది నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించగా.. వారు 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి.. ఆ తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఇక ఈ 18 మంది నిందితుల్లో అల్మాస్ మహరాజ్ అనే వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉండటం గమనార్హం. ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. వీళ్లు కాకుండా ఒక నిందితుడిపై 377 కేసుల్లో ప్రత్యేక కేసు నడుస్తోంది. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఫరూక్ చిస్తీ.. అతని అనుచరులు.. కాలేజీ అమ్మాయిలపై అత్యాచారాలు చేసేవారు. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి వారికి మత్తు మందు తాగించి.. సామూహిక అత్యాచారం చేసేవారు. ఆ తర్వాత వారు నగ్నంగా ఉన్నపుడు ఫోటోలు తీసి బెదిరింపులకు దిగేవారు. వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని.. ఈ నగ్న ఫోటోలు చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com