ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలహాలతో ఇద్దరు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:45 PM

కాకినాడ జిల్లా జగ్గంపేట జగనన్న కాలనీలో సోమవారం సాయంత్రం ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన జరిగింది. జగ్గంపేట పోలీసులకు సమాచారం రావడంతో ఎస్‌ఐ రఘునాధరావు, ఏఎస్‌ఐ నూకరాజు సంఘటనా స్థలానికి చేరుకుని స్ధానికుల నుంచి వివరాలు సేకరించారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం... గత మూడేళ్లుగా జగనన్నకాలనీలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రంగంపేటకు చెందిన వివాహిత అన్నాబత్తుల ప్రసన్న అద్దెకు ఉంటుంది. అదే విధంగా జగ్గంపేటకు చెందిన యువకుడు నాని (25) ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇద్దరి మధ్య కలహాలు రావడంతో సోమవారం సాయంత్రం ఆమె ఉరేసుకోగా అది చూసి తట్టుకోలేక అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు స్ధానికులు తెలియజేశారు. దీనిపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com