ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:44 PM

వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది. అందుకే.. ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారన్నారు. జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా... ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా? అని నిలదీశారు. అవినీతి చేశారు కాబట్టే.. వివిధశాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని.. ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు. జగన్‌ను చూసి భయపడి.. ఒక్కరూ కూడా ఏపీకి రాలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడి దారులు మళ్లీ ఏపికి వస్తున్నారన్నారు. తాము చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవడానికి సిగ్గుండాలని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జోగి రమేష్ భూబాగోతం చూశామని.. అటాచ్ ఆస్తులను కూడా స్వాహా చేశారన్నారు. వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయన్నారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని.. ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారన్నారు. ఫలానా శాఖలో మేము దోచుకోలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏ శాఖ పేరు చెప్పినా.. తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com