ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్‌ 17కు వాయిదా పడిన జగన్ కేసుల విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:38 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసుల‌ప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్‌ దాఖలు చేశారు. ఇప్పటికే జగన్‌తో పాటు సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్‌ వాదించారు. ఈ క్రమంలో పిటిషన్లపై విచారణను సెప్టెంబర్‌ 17కు తెలంగాణ హైకోర్టు  వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com