ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫ్యలం స్పష్టంగా కనిపిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 06:55 PM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి తనకున్న మీడియా బలాన్ని వినియోగిస్తోందని, దీనివల్ల ప్రజలే ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. విభజన వల్ల రాష్ట్రం కోల్పోయిన ఆదాయాన్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా పొందవచ్చని అంతా ఆశించినప్పటికీ అది జరగలేదని గుర్తు చేశారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం, తామే కడతామని విభజన చట్టంలో పొందుపర్చినా, ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని దోచుకోవాలన్న దుర్భుద్ధితో అప్పటి సీఎం చంద్రబాబు, దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని చెప్పారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి, ప్రొటోకాల్‌ ప్రకారం కాకుండా, ఇష్టానుసారం ప్రాజెక్టులో కీలకమైన మూడు పనులు ఒకేసారి మొదలు పెట్టారని, దాని వల్లే తప్పిదాలు జరిగి, నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆ శాఖ మంత్రి స్వయంగా ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు స్వార్థం, తప్పిదం వల్ల రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోగా, వారిపై అదనంగా రూ.900 కోట్ల భారం (కొత్త డయాఫ్రమ్‌ వాల్‌కు అయ్యే ఖర్చు) పడుతోందన్న మాజీ మంత్రి, దీనికి బాధ్యులెవరని నిలదీశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, శాంతి భద్రతల పూర్తి వైఫ్యలం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. హామీలు అమలు చేయకుండా, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయడం, ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com