ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 10:36 AM

తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్‌కు వచ్చిన జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com