ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటలను నాశనం చేస్తున్న జింకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:28 PM

రాజుపాలెం మండలంలోని గోపాయి పల్లెలో మంగళవారం పంట పొలాలను జింకలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 20 ఎకరాల వరకు కంది సాగు చేస్తే జింకలు మేయడంతో పంట పోయిందని రైతు రామయ్య తీవ్ర ఆవేదన చెందారు. ఎకరాకు రూ. 2వేలు నష్టపోయినట్లు తెలిపారు. మళ్ళీ పంట సాగు చేయాలంటే జింకలు పంటను నాశనం చేస్తాయని భయపడుతున్నామని తెలిపారు. అటవీ అధికారులు స్పందించి జింకలను పంట పొలాలకు రాకుండా చూడాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com