ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 03:15 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీల స్వీకరించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో పుష్ఫమణి, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌రాజు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎం.ముక్కంటి, కె.భాస్కర్‌ అర్జీలను స్వీకరించారు. 182 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో క్షుణంగా పరిశీలన చేసి పారదర్శకంగా విచారణ చేసి గడువులోగా సమస్య పరిష్కరించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com