ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 10:47 AM

శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు వచ్చే ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని.. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com