రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీరియస్ అయ్యారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయని ఆరోపించారు.