ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వేగంగా దూసుకెళ్తోంది. దేశాభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2050 నాటికి దేశంలోని 100 నగరాల్లో జనభా 10 లక్షలకుపైగా పెరగనుంది. ప్రస్తుతం 8 మెగా సిటీలకు ఇవి అదనం. పట్టాణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, టూరిజం, ఆఫీస్ డైనమిక్స్ వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో రానున్న 5-6 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు, బలమైన వృద్ధి అవకాశాలను అంచనా వేస్తూ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కొలియర్స్ (Colliers) ఓ నివేదిక తయారు చేసింది.
దేశంలోని 100 నగరాలు ఎమర్జింగ్ సిటీలుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక తెలిపింది. సమానమైన వృద్ధి, రియల్ ఎస్టేట్ హాట్స్పాట్స్గా ఉన్నట్లు తెలిపింది. ఈ 100 నగరాల్లో 30 నగరాల్లో అధిక వృద్ధి రేటు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా వీటిలో 17 నగరాలు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి తరగతుల్లో వేగవంతమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. ఈ జాబితాలో ఆంధ్రప్రేదశ్ నుంచి రెండు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అవి తిరుపతి, వైజాగ్ ఉన్నాయి. 17 నగరాల లిస్ట్ ఓసారి చూద్దాం.
వైజాగ్..
పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా గిడ్డంగులు, ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డేటా కేంద్రాల కోసం డిమాండ్ పెరుగుతుంది. ఈ అంశంలో జైపూర్, కాన్పూర్, లక్నవూ, నాగ్పూర్, పట్నా, సూరత్ నగరాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం చోటు దక్కించుకుంది. వైజాగ్లో డేటా కేంద్రాలు, గిడ్డంగులు, ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలకు ముందు ముందు డిమాండ్ పెరగనుందని కొలియర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. దీంతో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరగనుంది. దీంతో ధరలూ అమాంతం పెరగనున్నాయి.
తిరుపతి..
కేంద్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక పర్యాటక విధానాలు, మౌలిక సదుపాయాల పెంపు నిర్ణయాలతో ఆధ్యాత్మిక నగరాల్లో మరింత వృద్ధిని పెంచేందుకు కారణమవుతాయని కొలియర్స్ నివేదిక తెలిపింది. టెంపుల్ సిటీలుగా పేరు గాంచిన అమృత్ సర్, అయోధ్య, ద్వారక, పూరీ, షిర్డీ, వారణాసి, తిరుపతి వంటి నగరాలు..పెరిగిన పర్యాటకం, ఆతిథ్య, రిటైల్ రంగాలలో అనుబంధ రియల్ ఎస్టేట్ అభివృద్ధి నుంచి ప్రయోజనం పొందుతాయని ఈ నివేదిక తెలిపింది. దీంతో ఆయా టెంపుల్ సిటీల్లో రియల్ బూమ్తో భూములు, ఇళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.