ఇండియాతో జరిగిన నాలుగవ వన్డేలో న్యూజిలాండ్ ఈజీ విక్టరీ నమోదు చేసింది. 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 14.4 ఓవర్లలో చేజ్ చేసి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వాస్తవానికి వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకున్నా.. కివీస్కు ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రాస్ టేలర్ 37, నికోలస్ 30 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. అయిదవ వన్డే ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్నది.
ఉదయం ట్రెంట్ బౌల్ట్.. భారత్ బ్యాట్స్మెన్ను హడలెత్తించాడు. తన పేస్తో టాప్ ఆర్డర్ను ముప్పుతిప్పలు పెట్టించాడు. స్వింగ్ అధికంగా ఉన్న సెడాన్ పార్క్లో.. ట్రెంట్ బౌల్ట్ సూపర్ షో కనబరిచాడు. బౌల్ట్ జోరుకు భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. దీంతో ఇండియా కేవలం 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. బౌల్ట్ పది ఓవర్లలో 21 పరుగులిచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు.
వన్డే సిరీస్ను చేజిక్కించుకున్న ఆనందంలో టీమిండియా కివీస్తో జరిగిన నాలుగవ వన్డేలో దారుణమైన ఆటను ప్రదర్శించింది. హామిల్టన్ పిచ్పై కివీస్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. ట్రెంట్ బౌల్ట్ ఇచ్చిన షాక్కు భారత్ స్వల్ప స్కోర్కే ఇన్నింగ్స్ను ముగించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే సిరీస్ గెలిచి.. జోరుమీదున్న భారత్కు అనుకున్నంతగా ఆరంభం లభించలేదు. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో కివీస్తో జరుగుతున్న నాలుగవ వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. 200వ వన్డే ఆడుతున్న రోహిత్కు .. హామిల్టన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. భారత్ క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. భారత ప్లేయర్లలో చాహల్ అత్యధికంగా 18 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. గ్రాండ్హోమ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మొదటి మూడు వన్డేల్లో పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా.. నాలుగవ వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. స్వింగ్, బౌన్స్, సీమ్ అధికంగా ఉండడంతో.. భారత్ కివీస్ బౌలర్లను ఎదుర్కొనలేకపోయింది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజ్ వద్ద నిలవలేకపోయారు. కివీస్ స్పీడ్స్టర్ బౌల్ట్ మాత్రం తన స్వింగ్తో రోహిత్ సేనకు చుక్కలు చూపించాడు.