ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:53 PM

వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి పాలన 


• ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, బాధలు తట్టుకొని ప్రభుత్వాన్ని స్థాపించాం 


• ప్రజల నమ్మకానికి న్యాయం చేస్తాం 


• రాష్ట్ర ప్రగతి కోసం సమష్టిగా పని చేద్దాం


• ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొద్దాము


• సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 


 


‘164 శాసనసభ స్థానాలు... 21 లోక్ సభ స్థానాలు... 93 శాతం స్ట్రయికింగ్ రేట్ తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. వారు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాల’ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని చెప్పారు. అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్ గా ఉన్న రాష్ట్రం... గత ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామనీ, గత పాలకుల విధానాల వల్ల పాలన ఎలా ఉండకూడదు అనే విషయానికి రాష్ట్రం మోడల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయడానికి పోటీ పడేవారని, మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకొద్దామని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పాలన దక్షతతో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం. మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం అయ్యేలా చేసేవాళ్లం. దేవుడి దయవల్ల అధికారంలోకి వచ్చాం. మాది మంచి ప్రభుత్వం.. జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం.  


• పంచాయతీల బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం  


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ, శాస్ర్తసాంకేతిక శాఖలను తీసుకున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రిజల్యూషన్ చేస్తున్నాం. తద్వారా పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. జలజీవన్ మిషన్ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 5.4 కోట్ల గృహలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త రోడ్లు, ఉన్న రోడ్లు బాగు చేయడం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com