నంద్యాల జిల్లా ఏరువాక కేద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డా. రామకృష్ణ రావు, మండల వ్యవసాయాధికారి పీరునాయక్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని తలముడిపి, మిడుతూరు, నాగలూటి, కడుమూరు గ్రామాల్లో పత్తి పంటను పరిశీలించారు. ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చు పురుగులు, మెగ్నీషియం దాతు లోపం వల్ల నష్టం కలుగజేస్తున్నట్లు గమనించామని చెప్పారు. రసం పీల్చు పురుగుల నివారణ చర్యల గురించి డా. రామకృష్ణారావు రైతులకు వివరించారు. పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా గులాబీ రంగు పురుగు నివారణకు తలముడిపి, మిడుతూరు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి 10 లింగాకర్శక బుట్టలు, 10,000 పీపీఎం గాడత వేప నూనె, 400 మి.లీ. ప్రోఫినోపాస్, 400 మి.లీ. క్లోరో పైరిఫాస్, 500 మి.లీ. క్లొరాత్ర నిలిప్రాల్, 60 మి.లీ. లాండ సహలాత్రిన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు పత్తి పంటలో ఎలా పెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించారు. వీఏఎస్లు సరస్వతి, అశోక్, ప్రమీల, రైతులు పాల్గొన్నారు.