మున్సిపల్ కార్మికులపై వార్డు సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ వార్డు ఇన్చార్జీల వేధింపులు ఆపాలని ఆ సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేర కు బుధవారం అరసవల్లి నగరంలోని మస్తర్ పాయింట్ల వద్ద కార్మికులంతా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. చనిపోయి న కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికుల సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సక్రమంగా పనిముట్లు ఇవ్వాలని, మస్తర్ పాయింట్ల వద్దనే ఎఫ్ఆర్ఎస్ తీయాలని కోరారు. ఇన్స్పెక్టర్ ఒకపని, వార్డు ఇన్చార్జి ఒక పని, సెక్రటరీ ఒక పని చెబుతున్నారని, తమ పనిని సక్రమంగా చేసు కోనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నారని, లేకుంటే కార్మికులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.గణేష్, ప్రతిని ధులు ఎ.రాము, ఎ.జనార్దన్, డి.యుగంధర్, ఎ.శంకర్, ఎన్.పార్వతి, ఆర్.ఈశ్వర్మ, ఎ.గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.