ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సర్పంచ్ సమస్యపై స్పందించిన పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 10:59 PM

నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్‌ బూదూరు లక్ష్మి సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్‍ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు తన సంతకాలు ఫోర్జరీ చేసి దూషించారంటూ మహిళా సర్పంచ్ లక్ష్మి.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో అసెంబ్లీ వద్దకు వెళ్లి డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com