ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తా కార్యక్రమంలో భాగంగా 4వ రోజు గురువారం ఒంటిమిట్ట మండల పరిధిలోని పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎంఈఓ జి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో భాగంగా చేనువారిపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. హెచ్ఎం అవ్వారు పెద్ద రెడ్డయ్య సాంస్కృతిక సాంప్రదాయాల గురించి వారికి వివరించారు.