కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని చెత్త సంపద తయారీ కేంద్రాన్ని డిపిఓ రవికుమార్ గురువారం పరిశీలించారు. చెత్త సంపద తయారీ కేంద్రం ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి ఆయన సెక్రటరీ లక్ష్మీకాంత్ ను అడిగి తెలుసుకున్నారు. తడి, చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామపంచాయతీ ద్వారా ఆదాయం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని డిపిఓ రవికుమార్ తెలిపారు.