ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ముటుకుల జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. గురువారం మండలంలో పర్యటించిన ఆమె పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి పరిశీలించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యతగా పిల్లలకు భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పుస్తకాలను చదివించారు.