ఇంకొల్లు మండలం భీమవరం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయింది. అతను బ్యాంక్ అధికారులమని ఆమెకు ఫోన్ చేశారు. బ్యాంకులో పెట్టిన బంగారం వేలంలోకి వచ్చిందని, తక్షణమే డబ్బులు కడితే ఆపుతామని తెలిపారు. దీంతో ఆ మహిళ ఫోన్ పే ద్వారా రూ. 37వేల నగదు పంపింది. అనంతరం బ్యాంక్ అధికారులను సంప్రదించగా ఎటువంటి కాల్ చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.