ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్ అధికారుల పేరిట ఫోన్ కాల్ తో మోసం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 03:33 PM

ఇంకొల్లు మండలం భీమవరం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ గుర్తుతెలియని వ్యక్తి చేతిలో మోసపోయింది. అతను బ్యాంక్ అధికారులమని ఆమెకు ఫోన్ చేశారు. బ్యాంకులో పెట్టిన బంగారం వేలంలోకి వచ్చిందని, తక్షణమే డబ్బులు కడితే ఆపుతామని తెలిపారు. దీంతో ఆ మహిళ ఫోన్ పే ద్వారా రూ. 37వేల నగదు పంపింది. అనంతరం బ్యాంక్ అధికారులను సంప్రదించగా ఎటువంటి కాల్ చేయలేదని చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com