ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని ఇప్పటి వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారో చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈకేసులో నిందితుడిని, దళిత వ్యక్తిని లాకప్లో పోలీసులు దారుణంగా కొట్టడంతో అతను చనిపోయాడు. ఇది లాకప్ డెత్.. ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఈ దారుణంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాలని కోరారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు . ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.