`సేవ్ డెమోక్రసీ` నినాదాలతో అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్న వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని చింపేసిన పోలీసులపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్లు చింపేసే అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా పోలీసులను నిలదీశారు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగదని, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారశైలిపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.