ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభజన కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం:చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 03:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి.. ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చిన నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన కంటే.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనతో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే.. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌కు వంద శాతం తేడా ఉండేదని పేర్కొన్నారు. తలసారి ఆదాయంలో తెలంగాణ.. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com