పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల పట్టణంలో డయేరియా ప్రభలుతోంది. సున్నంబట్టీల పరిసర ప్రాంతాలలో తాగు నీటి కాలుష్యంతో డయేరియా వ్యాప్తి చెందింది. రెండు రోజుల క్రితం అబుబాక సిద్దిక్ (9) అనే బాలుడు మృతిచెందాడు. దీంతో అప్రమత్తమైన మున్సిపల్, వైద్యాధికారులు ఆయా ప్రాంతాలలో పారిశుధ్య చర్యలకు ఉపక్రమించారు. అయినప్పటికీ శుక్రవారం 15 మంది వాంతులు, విరేచనాలతో లెనిన్నగర్, పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డయేరియా మరింత ప్రబలకుండా అధికారులు ఆయా ప్రాంతాలలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. వైద్యాధికారులు అందుబాటులో వుండి వైద్యసేవలు అందించడంతో శుక్రవారం సాయంత్రానికి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.