రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత జరుగుతున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! పెండింగ్ అంశాల పరిష్కారంపై కలిసి మాట్లాడుకుందామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ అంగీకరించిన నేపథ్యంలో... హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రులిరువురూ భేటీ కానున్నారు. విభజన అంశాలే అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా 1) విభజన చట్టం షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థలు, షెడ్యూల్ పరిధిలో ఉన్న 142 సంస్థలు, విభజన చట్టంలో ప్రస్తావనకు రాని 12 సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన. 2) విద్యుత్ బకాయిలు. 3) జల పంపకాలు ఈ మూడు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.