ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఆస్తులైన వైసీపీ కార్యాలయాల్లోకి వెళ్లి సందర్శించడం సరికాదన్న బొత్స మాటలపై ఆయన ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఎమ్మెల్యే గంటా గుర్తు చేశారు. భయపెట్టడం, బెదిరించడమనేది మీ పార్టీ నాయకుల పేటెంట్ సత్తిబాబు అంటూ ఎక్స్ వేదికగా బొత్సపై గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.