దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జూలై 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శాకంబరీదేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 19వ తేదీన ఉద యం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహిస్తామని, సాయంత్రం 4 గం టలకు కలశస్థాపన చేసి అగ్ని ప్రతి ష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణలు ఉంటాయని తెలిపారు. 20వ తేదీ ఉద యం 8 గంటలకు సప్తశతి, మహా విద్యా పారాయణలు, హోమాలు ఉం టాయని సాయంత్రం 5 గంటలకు మూలమంత్ర హవనాలు, 21వ తేదీ ఉదయం 8 గంటలకు సప్తశతి, మహా విద్యా పారాయణలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటపపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అవి ముగి శాక 9.30 గంటలకు పూర్ణాహుతి, కలశోధ్వాసన, మార్జనం, ప్రసాద వితరణలతో శాకంబరీ దేవి ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.