జూలై 6 నుంచి 15వ తేదీ వరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొలిసారిగా వారాహిదేవి పూజాధికాలు జరుగుతాయని ఈవో పేర్కొన్నారు. దేవస్థానం అర్చకులు ప్రత్యే కంగా జప, తప, హోమాదులు నిర్వహించి అమ్మవారికి తర్పణ చేస్తారని, ఇవి అంతర్గతంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కనకదుర్గమ్మకు పవిత్రసారె సమర్పించే కార్యక్రమాలు ఉంటాయ న్నారు. అమ్మవారికి మహామండపం ఆరో అంతస్థులో సారె స్వీకరణ, పూజాధికాలు నిర్వహి స్తారని తెలిపారు. జూలై 14వ తేదీన హైదరాబాద్ పాతబస్తీ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పణ ఉంటుందన్నారు. జూలై 26వ తేదీన దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున భాగ్యనగర్ మహాంకాళీ అమ్మవారి ఉమ్మడి దేవా లయాల ఉత్సవాలకు పట్టువస్త్రాల సమర్పణ చేస్తామన్నారు.