ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని.. భయం వలన వారు రాలేకపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ను ప్రజలు కక్ష కట్టి ఓడించారన్నారు.