చంద్రబాబు నేడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మారటానికి కొంచెం టైమ్ పట్టినా, త్వరలోనే సెట్ అవుతారని అన్నారు. 1995 తరహాలో సీఎం 4.0 చంద్రబాబును ఇక ప్రజలు చూస్తారని, రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తామని అన్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రహదారి విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదని.. ఈసారి ఎవ్వరూ అడ్డుపడకుండా రహదారి పూర్తికి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.