పల్నాడు జిల్లా, మాచర్లలో మాత్రం పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. విషయం తెలిసిన మున్సిపల్ కమిషన్.. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీలో కమీషన్ తీసుకున్నందుకు గాను వాలు నాయక్ను సస్పెండ్ చేస్తున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు.