ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో, కొవ్వూరులో ఉన్న కోర్టులలో ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తమకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో ప్రాంసరీ నోటు దావాలు, ఆస్తిదావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్ఫండ్ సంబంధిత, ఆర్బిటేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు ఎన్హెచ్ఎఐ భూసేకరణ వ్యవహారాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, దాంపత్య హక్కుల పునరుద్దరణ, నిర్వహణ, సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని ఏలూరులో 9 బెంచ్లు, మరో 26 బెంచ్లు జిల్లాలో ఉన్న అన్ని మండల న్యాయసేవాధికార సంస్థలో ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమవరం, నరసాపురంలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీలలో వీడియోకాన్ఫరెన్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రదేశాలు ఉన్న కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు వారు ఉన్న ప్రదేశం నుంచే వీడియో కాన్ఫరెన్సుతో కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించదగిన వాటిని ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఏదైనా సమాచారం కావాలంటే ఏలూరులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఫోన్ నంబరు 08812–22455ను గాని వాట్సాప్ నంబరు 94409 01064లో సంప్రదించాలని సూచించారు.