భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. గొటివాడ పంచాయతీ మూర్తిపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దళితవాడలోనూ అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇండియన్ ప్రజాబంధు జాతీయపార్టీ సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రంజిత్ ఓఫీర్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షురాలు మల్లేశ్వరి, దళిత నాయకులు పిల్లి రామారావు, వేల్పుల సత్యనారాయణ, సర్పంచ్ నవిరి పోతయ్య, ఇన్చార్జి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, టెక్కలి డీఎస్పీ బాలచంద్రా రెడ్డి ఎస్ఐ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.