ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 12:28 PM

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్య­కర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నా­రు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమ­వారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయు­డు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిస­భ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా చైర్మన్‌గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com