ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు 21 సెకన్ల కంటే ఎక్కువ సేపు మూత్రం పోస్తున్నారా.. అయితే బీ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2024, 07:32 PM

మూత్రం అనేది మనం చాలా సాధారణ విషయంగా చూస్తాం. కానీ ఆ మూత్ర విసర్జన కూడా మన ఆరోగ్యంలో భాగమే అని చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు. ఈ క్రమంలోనే మూత్ర విసర్జనకు సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మూత్రం ఎంతసేపు పోస్తున్నారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. అందులో మనం ఇప్పటివరకు వినని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూత్ర విసర్జన చేసే సమయాన్ని బట్టి.. ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు తాజాగా వెల్లడించారు.


మూత్రం, మూత్ర విసర్జనకు సంబంధించి కీలక పరిశోధనను జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు చేశారు. వారు నిర్వహించిన అధ్యయనంలో 21 సెకన్లలో మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యకరం అని తేల్చారు. అంతకంటే ఎక్కువ సేపు మూత్రం పోస్తే అది అనారోగ్యానికి దారి తీస్తుందని గుర్తించారు. మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు గుర్తించారు. మూత్రాశయాన్ని పర్యవేక్షిస్తూ.. ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓ చిన్న చిట్కా ఉందని కూడా వారు వెల్లడించారు.


మనుషులు సుమారు 21 సెకన్లలో మూత్ర విసర్జనను పూర్తి చేయడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనంలో తేలింది. అలా కాకుండా ఎక్కువసేపు గానీ, తక్కువ సేపు గానీ మూత్రం పోయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని స్పష్టం చేశారు. ఇక పదేపదే మూత్రవిసర్జన చేయడం.. చాలా తక్కువసార్లు మూత్రం పోయడం ఆరోగ్యానికి నష్టమేనని ఈ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు 21 సెకన్ల రూల్ పాటించాలని పరిశోధకులు సూచనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com