ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం నాకు ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 02:49 PM

ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంద‌ని, ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మనలో పోరాటపటిమ తగ్గకూడదన్నారు. త‌న‌ వయసు చిన్నదే. త‌న‌లో సత్తువ ఇంకా తగ్గలేద‌ని ఉద్ఘాటించారు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడు దయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంద‌ని పేర్కొన్నారు. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షులు  వైయస్.జగన్ కీలక సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు వైయస్.జగన్ దిశానిర్దేశం చేశారు.  పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపైనా కూడా వైయస్.జగన్ చర్చించారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీకూడా సమావేశంలో చర్చించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com