ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి ఏటీఎంలోకి దూరి 18 లక్షలు చోరీ.. సీసీటీవీ కనిపెట్టకుండా.. అమ్మబాబోయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:32 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఏటీఎంలలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఏటీఎం సెంటర్లలోకి చొరబడుతున్న దొంగలు.. ఏటీఎం యంత్రాలను బద్ధలుకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోనూ భారీ దొంగతనం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. కూడేరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఉన్న ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. గ్యా్స్ కట్టర్‌తో ఈవీఎంను ధ్వంసం చేసిన దుండగులు.. అందులో ఉన్న రూ.18 లక్షల నగదును కాజేశారు. ఈవీఎంలో ఉంచిన రూ.18.41లక్షల నగదు చోరీకి గురైనట్లు.. సీఎంఎస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు నరసింహగౌడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కీలక వివరాలు వెల్లడించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పలు ఆధారాలను సేకరించారు. అయితే దోపిడీ సమయంలో దొంగలు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. తమను గుర్తించేందుకు వీలులేకుండా సీసీ కెమెరాలకు ఎర్రటి ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వేళ.. ఏటీఎం సెంటర్లోకి చొరబడిన దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను తెరిచినట్లు వెల్లడించారు.


మరోవైపు గ్యాస్ కట్టర్ సాయంతో కట్ చేయటంతో మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దశబ్దం రాగా.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. అయితే అప్పటికే తమ పనిని పూర్తిచేసుకున్న దుండగులు.. కార్లో అక్కడి నుంచి ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏటీఎం నుంచి రూ.18,41,300 చోరీ చేసినట్లు తెలిసింది. అయితే దొంగలు చాలా తెలివిగా సీసీ కెమెరాలకు ద్రావణాన్ని పూయటంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com