ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీలో ఫైళ్ల అపహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 06, 2024, 02:45 PM

ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచి­వా­­లయం, హెల్త్‌క్లినిక్‌ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైయ‌స్‌ జగన్‌­మోహన్‌రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్‌ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారి­గూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకా­లను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచి­వాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగుర­వేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణ­రావు చికెన్‌ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసు­లకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివా­ల­యం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణ­రావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివా­లయం, హెల్త్‌క్లినిక్‌ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com