ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతోపాటు, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోలాహలం పూర్తయిందని, ఇక ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, దేవరకొండ నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తేవడం కోసం కృషి చేసిన కాంగ్రెస్, మిత్రపక్ష శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.