నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద ఉన్న నూతన అటవీ శాఖ రేంజర్ కార్యాలయం వద్ద బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రేంజ్ అధికారి సునీల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కనీసం కుటుంబానికి ఒక మొక్క తప్పకుండా నాటాలన్నారు. అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.